
మానేటి న్యూస్ నవంబర్:23 చిగురుమామిడి ప్రతినిధి కిరణ్ కుమార్.
* నాణ్యమైన సిరిసిల్ల చీరలను తెలంగాణ ప్రభుత్వంపై ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండాలి…
* నాణ్యమైన సిరిసిల్ల చీరలను పంపిణీ..
* మహిళల ఐక్యతకు ఈ చీరెలు ప్రతిక
* అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలు..
* ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్…
చిగురుమామిడి:తెలంగాణ ప్రభుత్వంపై ఎల్లప్పుడూ మహిళల ఆశీర్వాదం ఉండాలని,18సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మహిళ ఉన్నతి-తెలంగాణ ప్రగతి పథకం ద్వారా నాణ్యమైన సిరిసిల్ల చీరలను ఇందిరా మహిళ శక్తి చీరెలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తుందని రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు.కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని మహాలక్ష్మి గార్డెన్స్ లో ఆదివారం మహిళా ఉన్నతి,తెలంగాణ ప్రగతి ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మహిళలకు బొట్టు పెట్టీ సారే (చీరలు)ను అందించారు.అనంతరం 9మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను,చీరెలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వకడే,హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డిలతో కలిసి పంపిణీ చేశారు.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ
తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ లోని 18సంవత్సరాలపైన ఉన్న మహిళలందరికీ సారే పెట్టాలని సిరిసిల్లలో తయారైన నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ఇంటింటికి వెళ్ళి మహిళా సంఘాల నాయకులు బొట్టు పెట్టీ ఈ చీర పెట్టాలని మంత్రి చెప్పారు.మహిళలందరూ ఐక్యంగా ముందుకు వెళ్ళాలని,ప్రభుత్వంపై మీఆశీర్వాదం ఉండాలన్నారు.గత 10సంవత్సరాలుగా మహిళలకు వడ్డీలేని రుణాలు లేవని,కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహిళలకు సున్నా వడ్డీ రుణాలను అందిస్తున్నామన్నారు.మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్ లు,పెట్రోల్ బంకులు,బస్సులు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు.ప్రజా ప్రభుత్వంలో మహిళల సమస్యలను పరిష్కరిస్తున్నామని,రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు.అమ్మ ఆదర్శ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు మీ ద్వారానే కల్పిస్తున్నామని,ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండాలని కోరారు.ఈ మధ్య ఇంటింటికి సర్వే చేశామని,అందులో ఉన్నత స్థానాలు వెళ్లడానికి కారణాలు ఏంటి అని పరిశీలిస్తే డబ్బు ,కులం,మతం ఇవేమి కాదని,ఎవరైతే గొప్పగా చదువుకున్నారో ఆ కుటుంబాలు ఉన్నత స్థానాలకు వెళ్ళాయన్నారు.చదువుకుంటేనే అవకాశాలు వస్తాయని,అప్పుడే కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థానాలకు వెళ్ళాయన్నారు.ఈ చీరలు కట్టుకోవడం ద్వారా ఒక బలం ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నా అని,నియోజకవర్గంకి 35వందల ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని, ఆ ఇల్లు చివరి దశలో ఉన్నాయన్నారు.ఇంకా కట్టుకొని వారు కట్టుకోవాలని,తరువాత మరో 35వందల ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని మంత్రి పేర్కొన్నారు.మహిళలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం,నూతన రేషన్ కార్డులు,సన్న బియ్యం పంపిణీ,200 యూనిట్లు ఉచిత విద్యుత్,500 కి గ్యాస్ పంపిణీ చేస్తున్నామన్నారు.ఇందిరమ్మ చీరలు ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టీ ఈ చీరలు పంపిణీ చేయాలన్నారు.స్థలం ఉన్నవారికి మహిళా సంఘాలకు భవనాలు ఇవ్వడానికి నిధులు కేటాయిస్తామన్నారు.మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని,మీ పిల్లలను ఉన్నతంగా చదువులు చదివించాలని కోరారు.మహిళలు ఐక్యంగా ఉన్నప్పుడే విజయాలు సాధ్యం అవుతాయని,ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా మహిళలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, తాహాశీల్దార్ మద్దసాని రమేష్, ఎంపీడీవో విజయ్ కుమార్,ఐకెపి ఏపిఎం శ్రీనివాస్,మాజీ జెడ్పిటిసి గీకురు రవీందర్, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు గందె రజిత,ఐకెపి సీసీలు దెంచనోజు సత్యనారాయణ, మహిళలు వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.