Blog

  • పాఠశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులు నిందితుడు అరెస్ట్- కరీంనగర్ జిల్లా పోలీసుల వేగవంతమైన దర్యాప్తు..

    మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 28/

    కరీంనగర్ జిల్లాలోని ఒక పాఠశాలలో మైనర్ విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఆ పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ / అటెండర్‌గా పనిచేస్తున్న మహ్మద్ యాకూబ్ పాషా (30), తండ్రి: మహ్మద్ మొహినుద్దిన్, స్వగృహం: శాయంపేట గ్రామం, గీసుకొండ మండలం, ప్రస్తుత నివాసం: కురిక్యాల గ్రామం, గంగాధర మండలానికి చెందిన వ్యక్తి.గత కొన్ని రోజులుగా పాఠశాలలో చదువుతున్న మైనర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, వారి సున్నిత శరీర భాగాలను తాకడం, మరియు సెలబ్రేషన్స్ సందర్భంగా విద్యార్థినులతో దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరించడం వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.ఈ అంశంపై జిల్లా చైల్డ్ & మహిళా సంక్షేమ అధికారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, మండల విద్యాధికారి, ఎంపీడీవో లు సంయుక్తంగా పాఠశాలను సందర్శించి, విద్యార్థినులతో విచారణ జరిపారు. విచారణలో ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు 27-10-2025 సాయంత్రం 5 గంటలకు గంగాధర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదుపై పోలీసులు పీఓసీఎస్ఓ, ఐటీ యాక్ట్ మరియు ఇతర కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు బాధ్యతను కరీంనగర్ రూరల్ ఏసీపీ జి. విజయకుమార్ స్వయంగా చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడినట్లు తేలింది.దీంతో గంగాధర ఎస్‌ఐ మరియు పోలీసులు నిందితుడిని వెతికివెళ్లి, 28-10-2025 ఉదయం 10.15 గంటలకు కరీంనగర్ రేకుర్తి చౌరస్తా వద్ద మహ్మద్ యాకూబ్ పాషాను అరెస్టు చేసి, వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చగా రిమాండుకు పంపించారు.మైనర్ అమ్మాయిలు మరియు మహిళలపై లైంగిక వేధింపులు లేదా దాడులకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే ఇలాంటి వేధింపులు ఎదురైన వారు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కరీంనగర్ రూరల్ ఏసీపీ జి. విజయకుమార్ తెలిపారు.

  • సర్దార్ పటేల్‌ జయంతి ర్యాలీ ఏర్పాట్లు సౌత్‌జోన్‌ ఆధ్వర్యంలో సమావేశం..

    మానేటి న్యూస్ కరీంనగర్‌, అక్టోబర్ 28/

    సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 31వ తేదీన జరగబోయే ఐక్యత ర్యాలీ ఏర్పాట్లపై సౌత్‌జోన్‌ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మాజీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.సమావేశంలో సౌజన్య అధ్యక్షురాలు గాయత్రి, సౌత్‌జోన్‌ భూతపూర్వ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • మోకుదెబ్బ హన్మకొండ జిల్లా అధికార ప్రతినిధి గా రాజు గౌడ్..

    కాజిపేట్ మానేటి న్యూస్ రమేష్ అక్టోబర్ 28/

    గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ హన్మకొండ జిల్లా అధికార ప్రతినిధిగా ఖాజిపేట మండలం మడికొండ గ్రామానికి చెందిన చింతగట్టు రాజు గౌడ్ ను నియమించినట్లు మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్ చేతుల మీదుగా నీయామక పత్రం అందజేసినట్లు తెలిపారు. గీత కార్మికుల సమస్యల కోసం గత కొన్నేళ్లుగా రాజు గౌడ్ చేస్తున్న కృషి ని గుర్తించి నియమించడం జరిగిందన్నారు. సంఘ నియమ, నిబంధనల ప్రకారం గీత కార్మికుల హక్కుల రక్షణ కోసం ఆర్ధిక, రాజకీయ,సామాజిక,విద్య, ఉద్యోగ రంగాలలో అభివృద్ధి చెందేలా రాజు గౌడ్ కృషి చేయాలని రమేష్ గౌడ్ తెలిపారు. తనను మోకుదెబ్బ అధికార. ప్రతినిధిగా నియమించిన జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్ కు, తన ఎన్నికకు సహకరించిన పశ్చిమడ్ల స్వామి గౌడ్ కు రాజు గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

  • నవంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు గురునానక్ దేవ్ జీ జయంతి వేడుకలు 3న అఫ్జల్ గంజ్ లోని శ్రీ గురు సింగ్ సభ నుండి నగర కీర్తనలు ప్రారంభం..

    సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 28/

    హైదరాబాద్, సిక్కుల తొలి గురువు గురు నానక్ దేవ్ జీ 556వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు… గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ (అఫ్జల్‌గంజ్‌), గురుద్వారా సాహెబ్ (సికింద్రాబాద్‌) ప్రబంధక కమిటీ లు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రకాశ్ ఉత్సవ్ పేరిట నవంబర్ 1 నుంచి 5 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు… ప్రబంధక కమిటీ అధ్యక్షులు సత్విందర్ సింగ్ బగ్గా, బల్దేవ్ సింగ్ బగ్గా, హర్ పీతం సింగ్ గులాటి, జస్పాల్ సింగ్ లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం, అప్జల్ గంజ్ లోని అశోక్ బజార్ గురు ద్వార్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో… వేడుకలకు సంబంధించిన కర పత్రాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. నవంబర్ 1న సికింద్రాబాద్ గురుద్వారా సాహెబ్ నుండి… నవంబర్ 3న అఫ్జల్‌గంజ్ గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ నుండి… రంగురంగుల నగర కీర్తనలు (పవిత్ర ఊరేగింపులు) నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక వాహనంలో మత గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ ని ఊరేగించనున్నట్లు వెల్లడించారు. ఈ ఊరేగింపుల్లో సంప్రదాయ విన్యాసాలైన కత్తి, కర్రసాముల, గుట్కా విన్యాసాలతో పాటు… పంజాబ్ నుంచి మార్షల్ ఆర్ట్స్ కళాకారులు, పంజ్ ప్యారాలు, శాబాద్ కీర్తనలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని పేర్కొన్నారు. విశాల్ దివాన్ ఉత్సవ్ వేడుక నవంబర్ 5న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతుందన్నారు. సుమారు 25,000 మందికి పైగా భక్తులు పాల్గొంటారని… దేశ, విదేశాల నుండి ప్రసిద్ధ రాగి జాతాలు గురుబానీ కీర్తనలు పఠిస్తారని తెలిపారు. అదే విధంగా నవంబర్ 4న సికింద్రాబాద్ గురుద్వారాలో, నవంబర్ 5న అఫ్జల్‌గంజ్ గురుద్వారాలో రాత్రి కీర్తనలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సమావేశంలో జనరల్ సెక్రెటరీ జగన్మోహన్ సింగ్, జోగేంద్ర సింగ్ ముజ్రల్, బచన్ సింగ్ లతో పాటు పెద్ద సంఖ్యలో సిక్కు సోదరులు పాల్గొన్నారు.

  • అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం బిఆర్ఎస్ పాలనలో మున్సిపాలిటీల్లో జరిగిన అభివృద్ధి శూన్యం టిపిసిసి ఉపాధ్యక్షులు నవాబ్ ముజాహిద్ అలంఖాన్..

    సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 28/

    హైదరాబాద్ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిందని టిపిసిసి ఉపాధ్యక్షుడు నవాబ్ ముజాహిద్ అలంఖాన్ అన్నారు. రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీలకు రూ.2,780కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మంగళవారం బర్కతప్పురలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని మున్సిపాలిటీల్లో జరిగిన అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2027లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రమంతా ఉన్న పట్టణాలను ‘గ్రోత్ హబ్’లుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించారని ఆయన తెలిపారు. పట్టణాభివృద్ధిలో భాగంగా మౌళిక వసతుల కల్పన, కాలుష్య నియంత్రణ, పౌర సేవలు మెరుగురచడం వంటి వాటికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలకు రూ.15 కోట్లు. అదనంగా గ్రామ పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలకు రూ.20 కోట్లు, పాత మున్సిపాలిటీలకు రూ.15 కోట్లు, కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.30 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, ప్రధాన కూడళ్ళ అభివృద్ధి, పార్కుల సుందరీకరణ వంటి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

  • కోరుట్ల మెట్ పల్లి మున్సిపాలిటీలకు మంజూరు అయిన 37.40 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులే..

    మా నేటి న్యూస్ జగిత్యాల అక్టోబర్ 28/

    భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణశాఖ అధ్యక్షలు బింగి వెంకటేష్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన అర్బన్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (UIDF) ద్వారా టైర్ -3 మున్సిపాలిటీలైన మన కోరుట్ల మరియు మెట్పల్లి మున్సిపాలిటీలకు 37.40 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీకి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కి ఇందూరు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఫోటోల కి పాలాభిషేకం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, ఇందురి తిరుమల వాసు, సుధవేణి మహేష్, ఇందూరి సత్యం మాట్లాడుతూ గత రెండు రోజులుగా కాంగ్రెస్ మరియు బి.ఆర్.ఎస్ నాయకులు కోరుట్ల మున్సిపల్ కు మంజూరు అయిన నిధులు తమ పార్టీ నేతలే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించినరానీ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు ఈ నిధులు పూర్తిగా కేంద్రం నుండి వచ్చినవే అని ఆయన అన్నారు కేంద్రం లో కోరుట్ల నాయకుడు లీడర్ ధర్మపురి అరవింద్ ఉన్నారని కేంద్ర నిధులు అడగకుండానే కోరుట్ల పట్టణానికి వస్తాయని అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదు కానీ మా నాయకుడు ధర్మపురి అరవింద్ అడగకుండానే కోరుట్ల కు నవోదయ విద్యాలయాము నియోజకవర్గములో కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చారని అన్నారు కాంగ్రెస్ మరియు బి. ఆర్.ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధుల విషయంలో నిలదీయాలని అలాగే కేంద్రం ఇచ్చిన ఈ 37 కోట్ల 40 లక్షలు పట్టణంలో అన్ని వార్డులకు పారదర్శకతతో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేందర్, చెట్లపెల్లి సాగర్,సీనియర్ నాయకులు రాచమడుగు శ్రీనివాసరావు, గిన్నెల శ్రీకాంత్, పోతుగంటి శ్రీనివాస్ పెండెం గణేష్, obc మోర్చా జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఊరుమండ్ల చరణ్,ఉపాధ్యక్షులు అక్కినపల్లి వెంకటరమణ తోట రాజేశం, ఒళ్ళుజి నగేష్, మైదం సత్యనారాయణ, ఉప్పులూటి రాఘవులు,బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సడిగే మహేష్,జక్కుల ప్రవీణ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎల్లాల నారాయణరెడ్డి,ఓం ప్రకాష్, నేమురి విజయ్,రాదారపు సత్యనారాయణ,గోనె రాజారాం, తోట రాజేశం, బీజేవైఎం అధ్యక్షులు కలాల సాయిచంద్, తోట దుర్గప్రసాద్, బీజేవైఎం ఉపాధ్యక్షులు ధమ్మ సంతోష్,పంబల అజయ్, బల్క ప్రేమ్ సాగర్, మరియు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • గెలుపు బాటలో వెలిచాల ప్యానల్..- అర్బన్ బ్యాంకు ఎన్నికల ప్రచారంలో దుసుకుపోతున్న నిర్మల భరోసా ప్యానల్ అర్బన్ బ్యాంక్ అభివృద్ధిలో జగపతిరావుది ప్రత్యేక ముద్ర- ప్రతి చోటా జగపతిరావు చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తున్న ఓటర్లు డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసలు.. తండ్రి బాటలో తనయుడు రాజేందర్ రావు..

    • అర్బన్ బ్యాంకు సభ్యుల నుంచి అనూహ్యా మద్దతు.. జగిత్యాల లో విస్తృత ప్రచారం..

    మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 28/

    కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ప్యానెల్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ఘనవిజయం సాధించే దిశగా రోజురోజుకు బ్యాంకు సభ్యుల నుంచి అనుహ్యా మద్దతు లభిస్తోంది. వెలిచాల మద్దతిస్తున్న ప్యానల్ గెలుపుతోనే అర్బన్ బ్యాంకు మహర్దశ లభిస్తుందని సంఘీభావం ప్రకటిస్తున్నారు. ప్యానల్ అభ్యర్థులకు కచ్చితంగా ఓటు వేసి గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు స్వయంగా ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేశారు. నీతిమంతంగా నిజాయితీగా అర్బన్ బ్యాంకు అభివృద్ధికి పాటుపడాలనే పట్టుదలతో తన వంతుగా ప్రత్యేక కృషి చేస్తున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకంగా జగిత్యాల ప్రాంతంలో రాజేందర్ రావు తండ్రి వెలిచాల జగపతిరావు పేరు తెలియని వారు లేరు. కరీంనగర్ రత్నం బ్యాంకు అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. బ్యాంక్ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారు. నిజాయితీగా నీతిమంతంగా సేవలందించేలా తన ప్యానల్ ను నాలుగు సార్లు గెలిపించుకున్నారు. గతంలో 1972 నుంచి 1977 వరకు జగిత్యాల ఎమ్మెల్యేగా జగపతిరావు పనిచేశారు. జగపతిరావు ఈ ప్రాంతం అభివృద్ధికి విశేష కృషి చేశారు. నాడు తాగునీటి కోసం అష్ట కష్టాలు పడుతున్న ప్రజానీకానికి అండగా నిలిచారు. జగిత్యాల నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్తు వెలుగులు అందించిన ఘనత జగపతిరావు గారిదే. ఇండ్లలో దీపాలు పెట్టుకొని జీవనం సాగిస్తున్న పేద ప్రజల ఇండ్లలో కరెంటు వెలుగులు నింపారు. సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయించి గ్రామ గ్రామానా విద్యుత్ సౌకర్యం పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు ఈ ప్రాంత రైతాంగం సంక్షేమం కోసం కొత్త కొత్త పరిశోధనలు అందించేందుకు దోహదపడేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అప్పటి పాలకులను ఒప్పించి పొలాస వ్యవసాయ క్షేత్రం ఇక్కడ ఏర్పాటు చేయించారు. తద్వారా పొలాస వ్యవసాయ క్షేత్రం ద్వారా పరిశోధనలు కొత్త కొత్త వంగడాల రూపకల్పనకు ఎంతో ధోహదపడుతున్నది. ఈ ప్రాంత రైతాంగం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనీ వెన్నుదన్నుగా నిలిచారు జగపతిరావు. ఇప్పటికీ రైతులు ప్రజల్లో జగపతిరావు పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఇప్పటికి ప్రజలు జగపతిరావును గుర్తు చేస్తున్నారంటే ఆయన చేసిన అభివృద్ధి ముద్ర ప్రత్యేకమైనది. జగిత్యాల ప్రాంత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా మార్క్ఫెడ్ సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చారు. అనేక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు ప్రసరించేలా చేశారు. *తండ్రి బాటలో తనయుడు..* అంతేకాకుండా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకొని కుల మతాలకతీతంగా వెలిచాల జగపతిరావు నాయకుడిగా, ప్రజల మనిషిగా.. ప్రజల ఆత్మబంధువుగా ముందుండి రాజకీయాలను నడిపించారు. అప్పటి పాలకులను మెప్పించి ఒప్పించి తన ప్రజల కోసం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మంజూరు చేయించారు. అదేవిధంగా నాడు కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఆవిర్భావంలో జగపతిరావు చేసిన కృషి నేడు సత్ఫలితాలను ఇస్తున్నది. బ్యాంక్ అభివృద్ధిలోనూ ప్రత్యేక కృషి ఉంది. నాలుగు సార్లు సొంతంగా ప్యానల్ ను ఏర్పాటు చేసి గెలిపించుకున్న ఘనత జగపతిరావుకి దక్కుతుంది. అదే ఒరవడితో ఆయన కుమారుడు వెలిచాల రాజేందర్ రావు తనదైన శైలిలో అన్ని వర్గాల వారితో మమేకమవు తున్నారు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ అండగా ఉంటున్నారు. వారి సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కరీంనగర్ డిసిసి అధ్యక్ష పదవ రేసులోనూ ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు పుష్కరకాలం తర్వాత జరుగుతున్నాయి. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వెలిచాల రాజేందర్ రావ్ ప్రత్యేకంగా ఒక ప్యానల్ ఏర్పాటు చేశారు. నీతిమంతంగా నిజాయితీగా అంకితభావం పట్టుదల సామాజిక చేసే వారిని ఒక ప్యానెల్ గా ఏర్పాటు చేశారు. తన తండ్రి జగపతిరావు బాటలో రాజేందర్రావు నడుస్తున్నారు. తాను ప్రతిపాదించిన ప్యానల్ అభ్యర్థులు విజయం సాధించేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రత్యేక ఒరవడితో ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ ప్యానల్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. తమ బ్యాంకు అభ్యర్థులను ఎందుకు గెలిపించాలనే అవసరం పై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. బ్యాంకు అభివృద్ధికి పాటుపడతారని ఎలాంటి అవినీతికి తావివ్వకుండా కార్పొరేట్ బ్యాంకులకు ధీటుగా తమ ఫ్యానల్ నడిపిస్తుందని, డిపాజిటర్ల నమ్మకాలను వమ్ము చేయరని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడున్న డిపాజిట్లను మూడింతలు పెంచుతామని నాలుగు కొత్త బ్రాంచ్ నుండి ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. చిన్న అవినీతి మరక అంటకుండా బ్యాంకు ను అభివృద్ధి బాటలో నడిపిస్తామని రాజేందర్ రావు చెబుతున్నారు. కరీంనగర్, గంగాధర, జగిత్యాల ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తూ, తమ ప్యానెల్ అభ్యర్థులను గెలిపించాలని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. *జగిత్యాలలో విస్తృత ప్రచారం..* ఈ నేపథ్యంలో…కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంతో పాటు రోటరీ పార్క్, శ్రీ కాసుగంటి నారాయణరావు కళాశాల మైదానం, హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంతాల్లోని వాకర్స్ అసోసియేషన్ బృందాలను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ప్రత్యేకంగా కలిశారు. విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ప్యానల్ అభ్యర్థుల వ్యక్తిత్వం చూసి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. గతంలో అవినీతి ఆరోపణలు ప్రత్యారోపణలు పనులు చేసుకున్న వారే మళ్లీ ఓటర్ల ముందుకు వచ్చి ఓట్లు అడగడం వింతగా ఉందని వారికి వివరించారు. తాము మంచి ప్యానెల్ ఏర్పాటు చేశామని వారిని ఆదరించాలని రాజేందర్ కోరారు. నీతిమంతమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మద్దతుతో ఈ నియోజకవర్గ నుంచి నుంచి గాదె కార్తీక్, కూసరి అనిల్ ను తమ ప్యానెల్ లో అవకాశం కల్పించామని వివరించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మద్దతు తమకు జగిత్యాల ప్రాంతంలో ఎంతో బలం వచ్చిందనీ, తమ ప్యానెల్ అభ్యర్థులు విజయం సాధించేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. కరీంనగర్ తో పాటు అదనంగా జగిత్యాల ప్రాంత అర్బన్ బ్యాంక్ ఓటర్ల సభ్యుల సహకారంతో తమ ప్యానెల్ ఘన విజయం సాధించి తీరుతుందని రాజేందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో వాకర్స్ ను కలిసి ప్రచారం నిర్వహించారు జగిత్యాల కు చెందిన గాదె కార్తీక్, వేణుగోపాల్ కూసరి అనిల్ కుమార్ తోపాటు తమ ప్యానెల్ అభ్యర్థులను గెలిపించాలని వెలి చాల రాజేందర్ రావ్ విజ్ఞప్తి చేశారు.

  • దివ్యాంగులకు సేవ చేయడం అభినందనీయం..జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..

    మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 28/

    స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సేవలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.కరీంనగర్ జిల్లా స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల, వృత్తి విద్యా శిక్షణ కేంద్రానికి నూతన బస్సు ప్రారంభోత్సవం జరిగింది. 26 లక్షల రూపాయలతో శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఈ బస్సు ను అందజేసింది.ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బస్సును ప్రారంభించి మానసిక విద్యార్థులకు కలిసి ప్రయాణించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మానసిక వికలాంగుల పాఠశాలను, వృత్తి విద్యా కేంద్రాన్ని స్థాపించి ట్రస్ట్ సభ్యులు నిర్విరామంగా దశాబ్దాల పాటు సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. దివ్యాంగుల మానసిక వికాసానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సేవలను కొనియాడారు.ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మానసిక వికలాంగుల పాఠశాలలో 130 మంది విద్యార్థులు చదువుతున్నారని, 40 మంది ఉపాధి పొందుతున్నారని అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి 136 మందికి కంటి ఆపరేషన్లు చేయించామని తెలిపారు.ఈ సందర్భంగా మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ డీజీఎం సిహెచ్ వెంకట రెడ్డి, బోర్డు డైరెక్టర్ తిరుమల, ట్రస్ట్ వ్యవస్థాపకులు బి.వెంకటయ్య, ఇతర ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. *తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శన* తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఇక్కడ నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ వైద్య పరీక్షలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య మహిళ, ఓపి రిజిస్టర్ ను పరిశీలించారు. గర్భిణీలకు 4 ఏ.ఎన్.సి వైద్య పరీక్షల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వారికి కచ్చితంగా నాలుగు ఏ. ఎన్. సి పరీక్షలు అయ్యేలా చూడాలని తెలిపారు. సాధారణ ప్రసవాల ప్రాధాన్యత పట్ల అవగాహన కల్పించాలని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి వెంకటరమణ ఉన్నారు. •దివ్యాంగులకు సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరం పరిశీలన ఎల్ఎండి కాలనీలోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అలింకో సహకారంతో నిర్వహించిన దివ్యాంగులకు, వయోవృద్ధులకు సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. శిబిరానికి హాజరైన వారి వివరాలు, వైద్య పరీక్షల వివరాలు పక్కాగా నమోదు చేయాలని అన్నారు.

  • లైంగిక వేధింపుల్లో హెచ్ఎం, సిబ్బంది పాత్రపై విచారణ కొనసాగుతోంది..

    అవసమైతే వారిపైనా పోక్సో కేసు నమోదు చేయాలి ఈ ఘటనపై కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సీరియస్ గా ఉన్నారు..

    • ప్రాథమిక విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు..

    •పిల్లల భవిష్యత్తుతో ముడి పడి ఉన్న సమస్య..

    •దయచేసి మీడియా సంయమనం పాటించాలి..

    ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు భరోసా కల్పించాలి. వంగరలో గురుకుల విద్యార్ధి ఆత్మహత్య దారుణం బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది..

    ఇకనైనా గురుకులాలు, హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ద వహించాలి తెలుగు రాష్ట్రాలపై భారీ వర్షాల నేపథ్యంలో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బ్రుందాలు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం సిద్ధం కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడిమానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 28కరీంనగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో యాకుబ్ భాషా అనే అటెండర్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గత 5 రోజుల నుండే లోతైన విచారణ జరిపి నివేదిక తెప్పించుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పోక్సో కేసు కావడంతో విషయం బయటకు వస్తే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని బయటకు రానియ్యలేదన్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత పాఠశాల హెడ్మాస్టర్ నిర్లక్ష్యం ఉన్నట్లు తేలడంతో ఈరోజు హెచ్ఎం ను కూడా సస్పెండ్ చేశారన్నారు. ఒకవేళ లైంగిక వేధింపుల విషయంలో హెచ్ఎం, ఇతర సిబ్బంది పాత్రపైనా విచారణ కొనసాగుతోందన్నారు. ఒకవేళ వారి పాత్ర కూడా ఉన్నట్లు తేలితే వారిపై పోక్సో కేసు నమోదు చేసేందుకు వెనుకాడొద్దని ఇప్పటికే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను కోరినట్లు తెలిపారు. ఈరోజు కరీంనగర్ లో ఓ ప్రైవేట్ చైల్డ్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వద్ద మీడియా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించగా పై విధంగా స్పందించారు. ‘‘నిన్న కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జరిగిన ఘటన దారుణం. ఇది పోక్సో కేసు. పిల్లల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య. దీనిని ప్రచారం చేయడంవల్ల వాళ్ల జీవితాలు ప్రమాదంలో పడతాయి. దయచేసి మీడియా సంయమనంతో వ్యవహరించాలి’’అని అభ్యర్ధించారు. ‘‘ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ గత 5 రోజుల నుండి లోతైన విచారణ జరిపించారు. నివేదిక తెప్పించారు. నిందితుడికి ఏ విధమైన ట్రీట్ మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఈ వ్యవహారంలో హెడ్మాస్టర్ నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెను సస్పెండ్ చేశారు. వారి పాత్ర ఉంటే వాళ్లపైనా పోక్సో కేసు పెట్టేందుకు వెనుకాడవద్దని అధికారులకు చెప్పాను. పిల్లలకు భరోసా ఇవ్వడంతోపాటు వారి తల్లిదండ్రులు ఆందోళన పడకుండా ధైర్యం కల్పించాలని కోరిన. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి భరోసా కల్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.’’అని వివరించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని వంగర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మీడియా ప్రస్తావించగా ‘‘వంగర గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య దారుణం. నిర్బంద విద్య కోసం ఇబ్బంది పెట్టకుండా విద్యార్థుల మానసిక పరిస్థితిని తెలుసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. దురద్రుష్టమేమింటే ఆనాడు బీఆర్ఎస్ హయాంలోనూ గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలోనూ ఆత్మహత్యల పరంపర కొనసాగింది. నెలల తరబడి విద్యార్థులు ఆందోళన పట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితి మారుతుందేమోనని అందరూ భావించారు. కానీ కాంగ్రెస్ పాలనలోనూ ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. గురుకులాల, హాస్టళ్ల దుస్థితి మారలేదు. ఒక ఘటన జరిగితే అది మళ్లీ పునరావ్రుతం కాకుండా కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ప్రభుత్వం గురుకులాలను, హాస్టళ్లను గాలికి వదిలేయడంవల్లే ఈ దుస్థితి నెలకొంది. ఇకనైనా ప్రభుత్వంపై గురుకులాలు, హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.’’అని వివరించారు.భారీ వర్షాల నేపథ్యంలో….మొంథా తుఫాను ప్రభావంవల్ల తెలుగు రాష్ట్రాలకు నేడు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలందించేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీంలను అలర్ట్ చేశాం. ఆంధ్రప్రదేశ్ లోని 19 జిల్లాల్లో వర్ష ప్రభావం భారీగా ఉన్నందున ఆ రాష్ట్రానికి అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ బ్రందాలను ఇప్పటికే పంపించాం. ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. అవసరమైతే అదనపు టీంలను పంపేందుకు సిద్దంగా ఉన్నాం. తెలంగాణలోనూ పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రాణ నష్టం లేకుండా చూడాలి. కేంద్రం పక్షాన అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నాం.’’అని పేర్కొన్నారు.

  • పాఠశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులు నిందితుడు అరెస్ట్..

    కరీంనగర్ జిల్లా పోలీసుల వేగవంతమైన దర్యాప్తు..

    మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 28/

    కరీంనగర్ జిల్లాలోని ఒక పాఠశాలలో మైనర్ విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఆ పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ / అటెండర్‌గా పనిచేస్తున్న మహ్మద్ యాకూబ్ పాషా (30), తండ్రి: మహ్మద్ మొహినుద్దిన్, స్వగృహం: శాయంపేట గ్రామం, గీసుకొండ మండలం, ప్రస్తుత నివాసం: కురిక్యాల గ్రామం, గంగాధర మండలానికి చెందిన వ్యక్తి.గత కొన్ని రోజులుగా పాఠశాలలో చదువుతున్న మైనర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, వారి సున్నిత శరీర భాగాలను తాకడం, మరియు సెలబ్రేషన్స్ సందర్భంగా విద్యార్థినులతో దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరించడం వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.ఈ అంశంపై జిల్లా చైల్డ్ & మహిళా సంక్షేమ అధికారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, మండల విద్యాధికారి, ఎంపీడీవో లు సంయుక్తంగా పాఠశాలను సందర్శించి, విద్యార్థినులతో విచారణ జరిపారు. విచారణలో ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు 27-10-2025 సాయంత్రం 5 గంటలకు గంగాధర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదుపై పోలీసులు పీఓసీఎస్ఓ, ఐటీ యాక్ట్ మరియు ఇతర కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు బాధ్యతను కరీంనగర్ రూరల్ ఏసీపీ జి. విజయకుమార్ స్వయంగా చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడినట్లు తేలింది.దీంతో గంగాధర ఎస్‌ఐ మరియు పోలీసులు నిందితుడిని వెతికివెళ్లి, 28-10-2025 ఉదయం 10.15 గంటలకు కరీంనగర్ రేకుర్తి చౌరస్తా వద్ద మహ్మద్ యాకూబ్ పాషాను అరెస్టు చేసి, వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చగా రిమాండుకు పంపించారు.మైనర్ అమ్మాయిలు మరియు మహిళలపై లైంగిక వేధింపులు లేదా దాడులకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే ఇలాంటి వేధింపులు ఎదురైన వారు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కరీంనగర్ రూరల్ ఏసీపీ జి. విజయకుమార్ తెలిపారు.