భీమదేవరపల్లి అక్టోబర్ 28(మానేటి న్యూస్)

భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోనీ పీవీ రంగారావు గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య సంఘటపై రాజకీయ పక్షాలు చేస్తున్న రాజకీయం మానుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం గురుకుల పాఠశాలను సందర్శించారు.అనంతరం మాట్లాడుతూ శుక్రవారం రోజున ఉరి వేసుకుని చనిపోయిన 10వ తరగతి విద్యార్థినీ శ్రీ వర్షిత మృతి అందరినీ బాధకు గురి చేసిందని,ఇది తట్టుకోలేని సంఘటన అని మరల ఎటువంటి సంఘటన మరల జరుగుకుంట చూడాలన్నారు.అదేవిదంగ ఎప్పుడు జరిగిన సంఘటన గల కారణాలను తెలుసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.అప్పటివరకు ఈ విషయం పై ఎవరు రాజకీయాలు చేయవద్దన్నారు.ఈ విషయలను సోషల్ మీడియా లో చూసి పిల్లలు భయపడుతున్నారని కావున వారిని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలను చేయకూడదన్నారు.అదేవిధంగా స్కూల్లో ఓపెన్ చేసి పిల్లల చదువులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా వారు ధైర్యంగా ఉండడానికి స్టాఫ్ ని ఎక్కువ సంఖ్యలో రాత్రివేళలో ఉంచాలని, స్టాఫ్ ను వారి యొక్క క్వార్టర్స్లోఉండాలని ప్రిన్సిపాల్, స్టాఫ్ కి తెలియజేసినారు.శ్రీ వర్షిత తండ్రి వనం తిరుపతి శక్రవారం రోజు వారి కూతురు యొక్క జ్ఞాపకాలను చూడ్డానికి స్కూల్ కి రావడం జరిగింది.వారిని పిల్లల యొక్క తల్లిదండ్రులు,గ్రామస్తులు వారిని పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు శ్రీరామోజు శ్రీనివాస్,బత్తిని శ్రీనివాస్, ఆవుల రాజయ్య,షేక్ అలీ, లింగన్న ,గ్రామస్తులు శ్రీరామోజు మొండయ్య,ఒల్లాల రమేష్,రఘు నాయకుల ప్రదీప్ రెడ్డి, గజ్జల సంజీవ్,పొన్నాల తిరుపతిరెడ్డి, స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply