
మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 19
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని బీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. హుజురాబాద్ బీఎస్ఆర్ గార్డెన్స్లో చందుపట్ల జనార్ధన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సందేల వెంకన్న కన్వీనర్గా వ్యవహరించారు.సమావేశంలో మాట్లాడిన అఖిలపక్ష నాయకులు ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. తాజాగా కేబినెట్ పాత రిజర్వేషన్ విధానాన్నే కొనసాగిస్తామని ప్రకటించడం హాస్యాస్పదమని విమర్శించారు. కామారెడ్డి సభలో ప్రకటించినట్టుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధం చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు.ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బీసీలలో చైతన్యం పెంచేలా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు.సమావేశంలో బీసీ జేఏసీ నాయకులు చిలకమారి శ్రీనివాస్, ఇప్పకాయల సాగర్, ఆకుల సదానందం, ఉప్పు శ్రీనివాస్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, ఎర్రబొజ్జ నారాయణ తదితరులు పాల్గొన్నారు. వక్తలుగా తడికమల శేఖర్, కట్కూరి రాజేందర్ మాట్లాడారు.అలాగే అఖిలపక్ష, ప్రజా సంఘాల నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బండారి సదానందం, తాళ్లపల్లి రమేష్ గౌడ్, ఎనగందుల వెంకటేశ్వర్లు, తొగరు బిక్షపతి, సొల్లు బాబు, మాడుగుల ఓదెలు, చల్లూరి రఘు చారి, దేవునూరి రవీందర్, రామ్ సారయ్య, చిట్యాల భాను, తాటిపాముల కనకయ్య, బొంగోని వెంకటయ్య, చీకట్ల సమ్మయ్య, దొంత హరికిషన్, గాజర్ల బుచ్చిరాజం, ఓడ్నాల ప్రభాకర్, కే.రామచంద్రం, గోస్కుల నాగమణి మధుకర్, జూపాక శివమణి, గరవేణి శ్రీకాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.