
జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా PDSU జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలోని గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్మేంట్ స్కాలర్షిప్ 7200 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు పై చదువులు చదవాలంటే కార్పొరేట్ కళాశాలలోని ఫీజులు కట్టాలని యాజమాన్యం ఒత్తిడి గురి చేయడం వల్ల విద్యార్థులు చదువులని మానేసే పరిస్థితి నెలకొంటుంది. విద్యార్థులకు రావలసిన బకాయిలు తక్షణమే విడుదల చేసి వారికి న్యాయం చేయాలని. జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చుట్టూ ప్రహరి గోడ లేకపోవడం వల్ల మహిళ విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిపై తక్షణమే ప్రభుత్వం ఎమ్మెల్యే స్పందించి జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(PDSU) ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా నాయకులు వంశీ,రవితేజ, అన్వేష్, సుమంత్, వైష్ణవి, రోజా, మేఘన విద్యార్థులు పాల్గొన్నారు. విప్లవ అభినందనలతో..పి.సికిందర్ PDSU జిల్లా ఉపాధ్యక్షుడు సెల్. 6304445249.