సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 28/

సుప్రీం.కోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజెఐ బిఆర్ గవాయి మీద జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం రోజున సైదాపూర్ లో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సంఘాల తిరుపతి అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో విహెచ్పిఎస్ ఎమ్మార్పీఎస్,ఎం ఎస్ పి అనుభంద సంఘల మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి పై జరిగిన దాడి ఉద్దేశ పూర్వకంగా జరిగిన దాడి ఇది, ఈ సంఘటన న్యాయ వ్యవస్థ, భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై, దళిత సమాజంపై జరిగిన దాడిగా భావించుకుంటామన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సుమోటగా తీసుకొని దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు .”నవంబర్ 1న హైదరాబాద్ లో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనకు”సైదాపూర్ మండలo నుండి ప్రతి గ్రామo నుండి బస్సులను ఏర్పాటు చేసుకొని అధిక సంఖ్యలో జనం తరలివచ్చి హైదరాబాదులో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సైదాపూర్ మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు జక్కోజు బిక్షపతి, సైదాపూర్ మండల ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మట్టెల రవీందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సైదాపూర్ మండల అధికార ప్రతినిధి పొడిశెట్టి అజయ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి బొరగల రమేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply