మానేటి న్యూస్ జగిత్యాల అక్టోబర్ 28/

మిషన్ పరివర్తన నషా ముక్తి భారత్ అభియాన్ సే నో టు డ్రగ్స్ – ఎస్ టూ డ్రీమ్స్ & గోల్స్ కార్యక్రమం.జగిత్యాల జిల్లా రాయికల్ మండలం లోని ఇటిక్యాల మోడల్ స్కూల్ లో విద్యార్థులకు అవేర్నెస్ కల్పించడం జరిగింది. భారతదేశంలో డ్రగ్స్ మరియు ఆంటీ డ్రగ్స్ వ్యవస్థ విచ్చలవిడిగా కొనసాగుతుందని మరియు డ్రగ్స్ వినియోగం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతుందని, నషా ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమం సామాజిక న్యాయం మరియు సాధికారిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2020 ఆగస్టు 15న ప్రారంభించడం జరిగిందని, ఇందులో భాగంగానే పిల్లలకు డ్రగ్స్ పై అవగాహన కల్పించడం, చికిత్స మరియు మాదక ద్రవ్యాలను అలవాటు పడిన వారిని పునరావాస కల్పించడం, మాదక ద్రవ్యాల నియంత్రణ, వినియోగాన్ని నిషేధించడం అనే విషయం పై అవగాహన కల్పించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి మొదటి,రెండవ బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల ప్రాజెక్ట్ CDPO మమత, సూపర్వైజర్స్ భాగ్య, సువర్ణ, నరేష్ DHEW అకౌంటెంట్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కొల్లూరి సంతోష్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply