
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి కే వెంకటేష్ ఆధ్వర్యంలో కొత్తపల్లి (హ) లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు రాజ్యాంగము కల్పించిన హక్కులు మరియు భద్రత కోసం కల్పించిన చట్టాల గురించి వివరించారు, జాతీయ న్యాయ సేవల టోల్ ఫ్రీ నెంబర్ 15100, మాదక ద్రవ్యాల నిరోధక, మరియు సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్స్ తప్పకుండా గుర్తుంచుకోవాలని తెలియజేశారు ఈ సందర్భంగా బాలికలు అన్ని పరిస్థితులలో ధైర్యంగా ఉండాలని ఏదైనా సమస్య తలెత్తితే తల్లిదండ్రులకు గాని ఉపాధ్యాయులకు గాని లేదా న్యాయ సేవా అధికార సంస్థ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కి గాని తెలియజేయాలని సూచించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అని,చెడు కోసము మొబైల్ వాడడం వలన ఎదుర్కోవలసిన దుష్పరిణామాలను వివరించారు, ఈ కార్యక్రమంలో లో న్యాయమూర్తితో పాటు లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్నం రమేష్ ఉపాధ్యాయుని మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు