X

ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో హరీష్ రావు దిట్ట.




ధర్మసాగర్ మానేటి  న్యూస్ డిసెంబర్ 2


*ముందు కవిత ఆరోపణలకు  హరీష్ రావు సమాధానం చెప్పాలి..

*వాళ్ళమీద వచ్చే ఆరోపణల నుండి ప్రజల దృష్టి మల్లించడానికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.

*బిసి లకు రిజర్వేషన్లు కల్పించడం బీజేపీకి ఇష్టం లేదు.

*9వ షెడ్యూల్ లో చేర్చితేనే బిసి రిజర్వేషన్ల అమలు సాధ్యం.

*బీజేపీకి బిసి లపైన ప్రేమ ఉంటే వెంటనే బిసి బిల్లుకు ఆమోదం తెలపాలి.

*ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలి.

*కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ద్వారానే గ్రామాల అభివృద్ధి సాధ్యం.

*వాళ్ళ మీద వచ్చే ఆరోపణల నుండి ప్రజల మరల్చడానికే బిఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు, కేటీఆర్ లు కాంగ్రెస్ ప్రభుత్వం పై నిరాధరమైన ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు.

చిల్పూర్ మండలం పల్లగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి  పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.

వందల ఎకరాల భూములు, వందల కోట్ల ఫాం హౌస్ లు ఉన్నాయని కావాలనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ అంచనాలను 1100 కోట్ల నుండి 1700 కోట్లకు పెంచారాని కవిత చేస్తున్న ఆరోపణలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో దిట్ట అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తూనే ఉందని తెలిపారు. కవిత ఆరోపణలు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు అందరూ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.

బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి బిసిలకు రిజర్వేషన్లు కల్పించడం ఇష్టం లేదని విమర్శించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిసి రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపిస్తే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోధించి 9వ షెడ్యూల్ లో చేర్చితేనే బిసి రిజర్వేషన్ల అమలు సాధ్యమని తెలిపారు.  దీనిని డిసి సంఘాల నాయకులు, ప్రజలు గమనించాలని సూచించారు. ఇదంతా తెలిసి కూడా కొంత మంది ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. ఇతర పార్టీల అభ్యర్థులు గెలిస్తే గ్రామాల అభివృద్ధి కుంటు పడుతుందని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే గ్రామ అభివృద్ధి సాధ్యం అవుతుందని వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక నిధులు తీసుకువచ్చానని అన్నారు. పని చేయని వారు, పనికిరాని వారు చాలా మాటలు మాట్లాడుతున్నారని, పంచాయతీ ఎన్నికల తర్వాత నియోజకవర్గ అభివృద్ధి పనులపై శ్వేత పత్రం విడుదల చేస్తానని స్పష్టం చేశారు. అభివృద్ధిలో ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్న నియోజకవర్గానికి ప్రజలు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post